మధ్యప్రదేశ్లోని చింద్వారాలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. జిల్లాలో ఓ వైపు ఓటింగ్ జరుగుతుండగానే
బీజేపీ నగర అధ్యక్షుడు అంకుర్ శుక్లా ప్రజలకు డబ్బు పంచారు. ఈ వీడియోను మధ్యప్రదేశ్
కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ (ట్విటర్)లో పంచుకుంది. '
బీజేపీ భారీ తేడాతో ఓడిపోనుంది. ఈ ప్రజాస్వామ్య హంతకులను దేశం ఎప్పటికీ క్షమించదు. అవినీతికి పర్యాయపదం
బీజేపీ' అని క్యాప్షన్ ఇచ్చింది.