మణిపూర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.4గా నమోదు

73చూసినవారు
మణిపూర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.4గా నమోదు
మణిపూర్‌లో భూకంపం సంభవించింది. కామ్‌జోంగ్‌లో ఈరోజు ఉదయం 5:32 గంటలకు భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది. జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు వచ్చాయని స్పష్టం చేసింది. ఈ భూప్రకంపనలతో ఎలాంటి ప్రాణ నష్టం గానీ.. ఆస్తి నష్టం గానీ జరగలేదని సమాచారం. ఈ భూప్రకంపనల వల్ల ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లల్లోంచి బయటకు పరుగులు పెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్