తెలంగాణలో బీఈడీ సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి నేడు ఎడ్ సెట్ నిర్వహించనుంది. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు 33,879 మంది దరఖాస్తు చేసుకోగా, అధికారులు 79 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ రేపు (శుక్రవారం) జరగనుంది. ఈ పరీక్షకు 92,808 మంది అప్లై చేసుకోగా, మొత్తం 259 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.