‘ఆప్‌’ మరో కీలక నేతకు ఈడీ సమన్లు

58చూసినవారు
‘ఆప్‌’ మరో కీలక నేతకు ఈడీ సమన్లు
ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఆప్‌ ఎమ్మెల్యే, గోవా ఆప్‌ ఇంఛార్జ్‌ దుర్గేష్‌ పాఠక్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. దుర్గేష్‌ పాఠక్‌కు ఈడీ నోటీసులు పంపడం ఇది రెండవసారి. 2022లో కూడా ఇదే కేసు విషయమై పాఠక్‌కు ఈడీ నోటీసులు పంపింది. అప్పట్లో లిక్కర్‌ కేసు నిందితుడు ఆప్‌ కమ్యూనికేషన్స్‌ ఇంఛార్జ్‌ విజయ్‌నాయర్‌ ముంబై ఇంట్లో ఈడీ సోదాలు జరిపినపుడు పాఠక్‌ అక్కడే ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్