మోదీ మళ్లీ ప్రధాని కావాలంటూ ఓ వ్యక్తి పొరబాటున వేలు నరుక్కున్నాడు. ఈ ఘటన తాజాగా కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది. కార్వార్లోని సోనార్వాడలో నివసిస్తున్న అరుణ్ వెర్నేకర్ ప్రధాని మోదీకి తన ఇంట్లో చిన్న గుడి కూడా కట్టాడు. మోదీ ప్రధాని కావాలంటూ గుడిలోని కాళీ మాతా ఫొటోకు తన రక్తాన్ని అర్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడమ చేతి చూపుడు వేలును చాకుతో కోసుకున్నాడు. ఆ వేలు సగానికి పైగా తెగిపోయింది.