పిల్లలకి పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు అయినప్పటికీ పుస్తకాలు అందించకపోవడంతో మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. విద్యాశాఖ పిల్లల చదువును నాశనం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మండిపడ్డారు. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టిఎ) పరీక్షల నిర్వహణను విధ్వంసం చేస్తే.. నాన్ బయోలాజికల్ ప్రధానికి చెందిన విద్యాశాఖ పిల్లల చదువును నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.