TG: తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అన్నారు. ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు. ‘మా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంది. అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యం. ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ. రాష్ట్రానికి రైతులే ఆత్మ.. వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాం’ అని గవర్నర్ అన్నారు.