గాజాలో ఈద్ బంద్

53చూసినవారు
గాజాలో ఈద్ బంద్
గాజాలో యుద్ధం కారణంగా 33 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 70 శాతం మంది మహిళలు, చిన్నారులే. ఐరాస వివరాల ప్రకారం.. దాదాపు 17 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సహజంగా ఈద్ పండుగను చుట్టాలు, స్నేహితులతో కలిసి, ప్రత్యేక ఆహార పదార్థాలను తయారుచేసుకుని ఆనందంగా జరుపుకుంటారు. కానీ ఇప్పుడు యుద్దం కొనసాగుతుండటంతో పండుగ చేసుకోవడం సాధ్యపడక, పిల్లలు కేవలం గత పండుగ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్