జగన్‌కు దమ్ముంటే వాటిపై లేఖ రాయాలి : హోంమంత్రి

583చూసినవారు
జగన్‌కు దమ్ముంటే వాటిపై లేఖ రాయాలి : హోంమంత్రి
AP : జగన్‌కు దమ్ముంటే ఆయన హయాంలో జరిగిన అఘాయిత్యాలపై మోదీకి లేఖ రాయాలని హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. ‘వివేకా హత్య కేసు దర్యాప్తు, డాక్టర్ సుధాకర్‌‌ను హింసించి చంపడం, జడ్జి రామకృష్ణపై దాడి వంటి ఘటనలపై విచారణ కోరుతూ జగన్ లేఖ రాయాలి. శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన ట్వీట్ చేయడం హాస్యాస్పదం’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్