వృద్ధ దంపతుల హత్య కేసు.. కన్న కొడుకే చంపేశాడు

66చూసినవారు
వృద్ధ దంపతుల హత్య కేసు.. కన్న కొడుకే చంపేశాడు
వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీ వీడింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుళ్లనగర్‌కి చెందిన కిష్టయ్య, నర్సమ్మ కుమారుడు లక్ష్మణ్ దుండిగల్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసై అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చడానికి తల్లి మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారంపై కన్నేశాడు. దీంతో తల్లిదండ్రులను ఇంటికి పలిపించుకున్నాడు. గత నెల 22న వారు ఇంట్లో నిద్రిస్తుండగా తల్లి గొంతునులిమి చంపేశాడు. తండ్రి నిద్రలేచి చూడటంతో తండ్రిని కూడా చంపేశాడు. భార్య సహాయంతో కారులో మృతదేహాలను తరలించి నర్సాపూర్ అడవుల్లో పెట్రోల్ పోసి తగలబెట్టారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు.

సంబంధిత పోస్ట్