లోక్సభ ఎన్నికలకు ముందే అధికారులు రికార్డు స్థాయిలో నగదు స్వాధీనం చేసుకున్నారు. 75 ఏళ్ల లోక్సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తెలిపింది. తొలి దశ పోలింగ్కు ముందు రికార్డు స్థాయిలో రూ.4,650 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి సగటున ప్రతిరోజూ రూ.100 కోట్ల చొప్పున సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.