మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్న్యూస్ చెప్పింది. అన్నదాతలకు రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. భోపాల్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈ పథకాన్ని తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.