భారత్‌లో ఎక్స్‌ యూజర్లకు ఎలాన్‌ మస్క్‌ షాక్‌

72చూసినవారు
భారత్‌లో ఎక్స్‌ యూజర్లకు ఎలాన్‌ మస్క్‌ షాక్‌
దేశంలో ఎక్స్‌ యూజర్లకు ఎలాన్‌ మస్క్‌ షాకిచ్చారు. భారత్‌లోని 2 లక్షల మందికిపైగా ఖాతాదారుల అకౌంట్లను ‘ఎక్స్‌ కార్ప్‌’ (X Corp) బ్లాక్‌ చేసింది. పిల్లలపై లైంగిక దాడులు, అశ్లీలత, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్‌ కట్టడిలో భాగంగా మార్చి నెలలో ఏకంగా 2,12,627 ఖాతాలపై నిషేధం విధించినట్లు ప్రకటించింది. కొత్త ఐటీ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నట్లు తన నెలవారీ నివేదికలో పేర్కొంది.

సంబంధిత పోస్ట్