చైనాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో రానున్న తుపాను దృష్ట్యా ఎమర్జెన్సీని పొడిగించారు. హీలాంగ్జియాంగ్, హునాన్, జియాంగ్జీలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ విధించింది. కాగా, మధ్య చైనాలోని పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి చెందారు. అలాగే హునాన్ ప్రావిన్స్లో నాలుగు ఇళ్లు కూలిపోగా, 8 మంది గల్లంతయ్యారు.