దేశ సైన్యంలో చేరాలనుకునే యువత కలను బీజేపీ చిదిమేసిందని, అధికారంలోకి వస్తే ‘అగ్నిపథ్’ రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ‘సాయుధ దళాల్లోకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు ఆగిపోవడంతో లక్షలాది మంది యువత భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. అగ్నివీర్లు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాలు కోల్పోయి నడి రోడ్డుపై నిల్చుంటారు. ఈ పథకం రద్దు చేస్తే యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.