ప్రపంచంలో ఎక్కడైనా సంపాదన మీద ఎక్కువగా దృష్టి పెడతారు. చాలా తక్కువ మంది మాత్రమే సంపాదనపై పెద్ద ఆసక్తి ఉండదు. ఇక అసలు విషయంలోకి వస్తే. ప్రపంచంలో యూరప్
లోని లక్సెంబర్గ్ ధనవంతమైన దేశంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ సగటున రూ. కోటి సంపాదిస్తారు. 2022లో ఈ దేశం తలసరి జీడీపీ 1,26,426 డాలర్లు అని గణంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన
భారత్ కరెన్సీలో సుమారు రూ.కోటి. కావున సగటున ప్రతి ఒక్కరూ కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. ఇక కొనుగోలు శక్తిలోనూ ఈ దేశం ముందంజలో ఉంది. ఉత్పాదతలో మాత్రం 2వ స్థానంలో ఉంది.