మాజీ గవర్నర్ తమిళిసైకి సొంత కారు కూడా లేదు!

52చూసినవారు
మాజీ గవర్నర్ తమిళిసైకి సొంత కారు కూడా లేదు!
మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తమిళనాడు లోక్‌సభ ఎన్నికల భరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె తన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తన మొత్తం ఆస్తులు రూ. 2.17 కోట్లు, ప్రస్తుతం రూ. 50 వేల నగదు, రూ. కోటి 57 లక్షలపైగా చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తన పేరిట సొంత కారు తనకు లేదని తెలిపారు. తన భర్తకు రూ.3.92 కోట్ల చరాస్తులు, కుమార్తెకు రూ. కోటి విలువైన చరాస్తులు ఉన్నాయని, 4 కార్లు ఉన్నాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్