టీఎస్ హైకోర్టులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట

51చూసినవారు
టీఎస్ హైకోర్టులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఓ బ్యాంకును మోసం చేసిన కేసులో మాజీ ఎంపీకి సీబీఐ కోర్టు ఐదేళ్లు శిక్ష ఖరారు చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గీత పోటీ చేయనున్నారని, సీబీఐ కోర్టు తీర్పు వల్ల పోటీకి అనర్హులయ్యే అవకాశం ఉందని న్యాయవాది వాదించారు. విచారణ అనంతరం ధర్మాసనం స్టే విధించి.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించింది.

సంబంధిత పోస్ట్