ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ స్పందించారు. కేజ్రీవాల్ ను జైల్లో ఉంచేందుకు కేంద్రం వ్యవస్థలన్నింటినీ ప్రయోగిస్తోందని.. ఇది నియంతృత్వం, ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్ కు జూన్ 20న బెయిల్ లభించగా, వెంటనే ఈడీ స్టే ఉత్తర్వులు తీసుకుందని.. మరుసటి రోజే సీబీఐ ఆయనపై అభియోగాలు మోపిందని మండిపడ్డారు. ఇవాళ ఆయనను అరెస్ట్ చేసిందని చెప్పారు.