టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు గడువు నిన్నటితో ముగియగా.. ఈ పదవి కోసం సుమారు 3వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో భారీగానే ఫేక్ అప్లికేషన్స్ వచ్చినట్లు సమాచారం. కొందరు ఆకతాయిలు.. మోదీ, అమిత్ షా, సచిన్, ధోని, హర్భజన్, సెహ్వాగ్ పేర్లతో నకిలీ దరఖాస్తులు పంపారు. దీంతో బీసీసీఐ ఈ అప్లికేషన్స్ను వెతికి తిరస్కరించే పనిలో పడింది.