హైదరాబాద్ లో నకిలీ పాస్పోర్టు స్కామ్లో ఇప్పటివరకు 14 మందిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల నిజామాబాద్కు చెందిన ఎస్బీ ASI లక్ష్మణ్ను అధికారులు అరెస్టు చేశారు. తాజాగా ఆదిలాబాద్లోని పాస్పోర్టు సేవా కేంద్రంలో పోస్టల్ అసిస్టెంట్ ప్రణబ్ను అరెస్టు చేశారు. నకిలీ పాస్పోర్టు వ్యవహారంతో సంబంధం ఉన్నవారి కోసం దర్యాప్తు చేస్తున్నామన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో 95 మంది శ్రీలంకకు చెందిన వారికి పాస్పోర్టులు జారీ చేసినట్లు గుర్తించారు.