కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఎన్టీఏ మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 7వ తేదీ వరకు పొడిగిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా నిర్ణయం తీసుకుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీ అర్ధరాత్రి 11.50 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 11 నుంచి 28వ తేదీ ఎంట్రన్స్ పరీక్ష వరకు నిర్వహించనున్నారు.