టీమిండియా వికెట్ కీపర్, తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఈ యువ బ్యాటర్ ఇటీవల వరుసగా ఫెయిలవుతున్నాడు. ఇప్పటివరకు ఏడు టెస్టులు ఆడిన భరత్ అత్యధిక స్కోరు 44 మాత్రమే. 12 ఇన్నింగ్స్ల్లో 20 సగటుతో 221 పరుగులే చేశాడు. వైజాగ్ టెస్టులోనూ 17, 6 పరుగులే చేసి దారుణంగా ఫెయిలయ్యాడు. దీంతో నెటిజన్లు భరత్పై ఆగ్రహిస్తున్నారు. వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటున్నాడని మండిపడుతున్నారు.