ఉత్తరప్రదేశ్లోని నహరాన్పూర్కు చెందిన రైతు వేద్ప్రకాష్ గత నెలలో భూ వివాదంలో అధికారుల ముందే నిప్పంటించుకున్నాడు. దీంతో వేదప్రకాష్ను వెంటనే స్థానిక సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రైతు మంగళవారం మరణించినట్లు అధికారులు తెలిపారు. రైతు మరణంతో నహరాన్పూర్ స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో శాంతిభద్రతల దృష్ట్యా సుల్తాన్పూర్ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.