హనుమకొండ రైల్వేస్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర నుంచి బళ్లారికి వెళ్తున్న బొగ్గు రైలులో మంటలు వ్యాపించాయి. గూడ్స్ రైలు హనుమకొండ స్టేషన్కు చేరుకొని ఆగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది.