గిట్టుబాటు ధర లేకపోవడంతో రోడ్డుపై ధాన్యం పారబోసిన రైతులు (వీడియో)

60చూసినవారు
పంజాబ్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ధాన్యాన్ని రోడ్డుపై పారబోశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మార్కెట్‌కు తరలిస్తే కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో చేసేది లేక నడిరోడ్డుపై ధాన్యాన్ని పారబోసి తమ నిరసనను తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్