ఘోర ప్రమాదం.. క్యాబిన్ లో ఇరుక్కున్న మృతదేహాలు

80చూసినవారు
ఘోర ప్రమాదం.. క్యాబిన్ లో ఇరుక్కున్న మృతదేహాలు
హైదరాబాద్ ఓఆర్ఆర్ పై మంగళవారం తెల్లవారుజామున వరుస ప్రమాదాలు జరిగాయి. సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎం సిమెంట్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్, క్లినర్ మృతదేహాలు డీసీఎం క్యాబిన్ లో ఇరుక్కుపోగా పోలీసులు కట్టర్ల సహాయంతో బయటకు తీశారు. మరోవైపు ఓఆర్ఆర్ పై సుతారిగూడ గ్రామం వద్ద ఆగి ఉన్న కంటైనర్ ను డీసీఎం ఢీ కొట్టగా డీసీఎం మృతి చెందారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్