యూపీలోని ముజఫర్నగర్ సమీపంలో జూన్ 21న దారుణం జరిగింది. ముజాహిద్పూర్ గ్రామంలో అమర్పాల్ (53)కు డబ్బు లావాదేవీల విషయంలో కొందరితో గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడు బబ్లూ ఒక్కసారిగా అమర్పాల్పై దాడి చేశాడు. ఇటుకతో పలుమార్లు కొట్టి అమర్పాల్ను చంపాడు. ఈ హత్య సీసీటీవీలో రికార్డ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీని పరిశీలించాక నిందితుడిని అరెస్ట్ చేశారు.