ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

85చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెగా డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించిన టెట్‌లో పాస్ కాని వారు, తాజాగా బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1న నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మొదట టెట్ నిర్వహించి, ఆ తర్వాత డిఎస్సీ ప్రిపరేషన్‌కు 30 రోజుల సమయం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్