ఘోర ప్రమాదం.. నవజాత శిశువుతో సహా నలుగురి మృతి (వీడియో)

54చూసినవారు
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫ్యామిలీ కారులో పూణె వెళ్తుండగా.. మద్యం మత్తులో వెళ్తున్న స్కార్పియో కారు ఆ కుటుంబాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అమ్మమ్మ, ఏడేళ్ల చిన్నారి, నెలన్నర పాప సహా ఒకే కుటుంబంలోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్