భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే అండర్పాస్లోకి భారీగా వరద నీరు చేరింది. బ్యాంక్ మేనేజర్ పుణ్యశ్రేయ శర్మ, క్యాషియర్ విరాజ్ ద్వివేది ప్రయాణించిన ఎస్యూవీ అక్కడ మునిగిపోయింది. ఈ సంఘటనలో వారిద్దరూ మరణించారు. హర్యానాలోని ఫరీదాబాద్లో ఈ సంఘటన జరిగింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.