మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదపుతప్పి వాహనం బోల్తా పడగా 14 మంది మృతి చెందారు. మరో 21 మందికి గాయాలైయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దిండోరిలోని బద్జార్ ఘాట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షాపురా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ యాక్సిడెంట్ జరిగింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను షాపురా హెల్త్ సెంటర్కు తరలించారు. మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం తరలించారు.