మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

58చూసినవారు
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దామోహ్ జిల్లాలో సోమవారం ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్