యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!

576చూసినవారు
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. హల్దీ ప్రాంతంలోని సుగర్ ఛప్రా మలుపు వద్ద అదుపుతప్పిన పికప్ వ్యాన్‌ రెండు కమాండర్ జీపులను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్