రంగారెడ్డి జిల్లా టంగటూరు గ్రామంలో తీవ్ర విషాదం నెటకొంది. నీరటి రవి(35) అనే ప్రైవేట్ ఉద్యోగి తన ముగ్గురు కుమారులు సాయికిరణ్(13), మోహిత్ కుమార్(10), ఉదయ్ కిరణ్(7) లను చంపేసి.. అనంతరం తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. గొలుసుకట్టు స్కాంలో చిక్కుకున్న రవి.. అప్పులు ఇచ్చిన జనం ఇంటికి రావడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.