మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రాష్ట్ర సచివాలయంలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. వల్లభ్ భవన్లోని నాల్గవ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఫైరింజిన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. భవనంలో చిక్కుకున్న ఐదుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదం వల్ల అనేక కీలక పత్రాలు కాలిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.