బావిలో పడిన ఓ మహిళను ఫైర్ సిబ్బంది కాపాడారు. ఈ సంఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన కూర రాజమణి(45) అనే మహిళ బద్దిపోచమ్మ వీధిలో ప్రమాదవశాత్తు బావిలో జారి పడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మహిళను బయటకి తీశారు. రాజమణికి తీవ్ర గాయాలు కావడంతో, ఆమెను పోలీసులు 108 వాహనంలో ఏరియా హాస్పిటల్కు తరలించారు.