క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఒడిశాలో మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సన్నిహితుడు, మాజీ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్ ఆదివారం ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో విడుదల చేశారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్కు సహాయం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని కూడా చెప్పారు. ఇటీవల ఒడిశాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ఓటమి పాలైంది.