యూపీలో కాల్పుల కలకలం చెలరేగింది. లక్నోలోని మలిహాబాద్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపబడ్డారు. సలీం కుమార్తె కుటుంబంపై కాల్పులు జరిపారని లక్నో డీఎం తెలిపారు. సలీం, లల్లన్లు అన్నదమ్ములని, వారి మధ్య భూవివాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. నిందితుడు లల్లన్, అతని కుమారుడు సలీం తమ కుమార్తె కుటుంబాన్ని ఫాలో చేస్తూ ఇంటికి వెళ్లినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.