ఒవైసీ కారుపై కాల్పులు.. నిందితులకు బెయిల్

79చూసినవారు
ఒవైసీ కారుపై కాల్పులు.. నిందితులకు బెయిల్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2022లో ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులు సచిన్ శర్మ, సుభమ్ గుర్జార్‌ల పేర్లు FIRలో లేవని జస్టిస్ పంకజ్ భాటియా పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించిన తర్వాత దర్యాప్తు అధికారి వ్యక్తం చేసిన అభిప్రాయం ఆధారంగా మాత్రమే వారు నేరంతో ముడిపడి ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్