పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో శుక్రవారం తీవ్ర ఎండల కారణంగా గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు. ఫైరింగ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో గాయపడిన మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.