వరద బాధితులకు రూ. 50 లక్షల విరాళం ఇచ్చిన 'మైత్రీ మూవీ మేకర్స్‌'

83చూసినవారు
వరద బాధితులకు రూ. 50 లక్షల విరాళం ఇచ్చిన 'మైత్రీ మూవీ మేకర్స్‌'
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్‌ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 50లక్షల విరాళాన్ని ప్రకటించింది. తమ వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో రూ.25 లక్షలు విరాళంగా ఇస్తున్నాం. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, త్వరగా సాధారణ స్థితికి రావాలని ఆశిస్తున్నాము అని తెలిపింది.

సంబంధిత పోస్ట్