వరద నష్టంపై ముగిసిన CM రేవంత్‌ సమీక్ష

63చూసినవారు
తెలంగాణలో వరద నష్టంపై CM రేవంత్‌ నిర్వహించిన సమీక్ష ముగిసింది. ఈ మీటింగ్ కు కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్, బండి సంజయ్ హాజరయ్యారు. ఒకేరోజు అత్యధికంగా 40cm వర్షం కురిసిందని.. రోడ్లు, ఇళ్లు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని వివరించారు. వరద నష్టం రూ.5,438 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని, ఏపీకి ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా.. తెలంగాణకూ సాయం అందించాలని శివరాజ్‌ ను కోరారు.

సంబంధిత పోస్ట్