ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల క్రితం ఉపాధ్యాయుడు జాదవ్ గజానంద్ జైనథ్ (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి భార్య విజయలక్ష్మి.. మహేష్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు కొన్ని ఫొటోలను గుర్తించారు. అయితే ప్రియుడి కోసమే భార్య విజయలక్ష్మి సుపారీ గ్యాంగ్తో ఫోన్ లో మాట్లాడి భర్తను హత్య చేయించినట్టుగా తేల్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.