బీఆర్ఎస్ నేత‌పై ఫోర్జ‌రీ కేసు న‌మోదు

72చూసినవారు
బీఆర్ఎస్ నేత‌పై ఫోర్జ‌రీ కేసు న‌మోదు
TG: బీఆర్ఎస్ నేత చల్లా ధర్మారెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదైంది. ఆయనతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి పురుషోత్తమ్‌ నాయుడుపై కూడా మాదాపూర్ పీఎస్‌లో కేసు న‌మోదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని విజన్ రిసార్ట్స్ పార్ట్‌నర్ రాజశేఖర్ రావు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ మేర‌కు కేసు న‌మోదు చేశారు. అంతేకాకుండా చల్లా ధర్మారెడ్డి తనను చంపుతామని బెదిరిస్తున్నారని రాజశేఖర్ రావు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్