భర్తతో కలిసి బీజేపీలో చేరిన కేరళ మాజీ డీజీపీ శ్రీలేఖ (వీడియో)

54చూసినవారు
కేరళలో అసెంబ్లీ ఎన్నికల గడువు మరో ఏడాదిన్నర మిగిలి ఉండగానే రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. పార్టీల్లో చేరికల పర్వాలు ఊపందుకున్నాయి. తాజాగా కేరళ మాజీ డీజీపీ, ఐపీఎస్‌ అధికారిణి ఆర్‌ శ్రీలేఖ బీజేపీలో చేరారు. ఆమె తన భర్తతో కలిసి కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్‌ సమక్షంలో వారు కాషాయ దళంలో చేరారు. ఈ సందర్భంగా శ్రీలేఖను సురేంద్రన్‌ శాలువా కప్పి సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్