మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు 14 రోజుల రిమాండ్‌

79చూసినవారు
మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు 14 రోజుల రిమాండ్‌
AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు మరో 14 రోజుల రిమాండ్‌ విధించారు. వెలగపూడిలో మహిళ మరియమ్మ హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. కస్టడీ ముగిశాక ఆయన్ను పోలీసులు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. నవంబర్‌ 4 వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. అనంతరం సురేష్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్