జనసేనకు చిరంజీవి రూ.5 కోట్లు విరాళం

1036చూసినవారు
జ‌న‌సేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి రూ.5 కోట్లు విరాళం అంద‌జేశారు. హైదరాబాద్‌ నగర శివారులోని ముచ్చింతల్‌లో 'విశ్వంభర' సినిమా షూటింగ్ సెట్‌లో చిరంజీవిని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు క‌లిశారు. చిరంజీవి పాదాలకు నమస్కరించిన పవన్‌ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం విరాళానికి సంబంధించిన చెక్కులను వారికి చిరంజీవి అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్