జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి రూ.5 కోట్లు విరాళం అందజేశారు. హైదరాబాద్ నగర శివారులోని ముచ్చింతల్లో 'విశ్వంభర' సినిమా షూటింగ్ సెట్లో చిరంజీవిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కలిశారు. చిరంజీవి పాదాలకు నమస్కరించిన పవన్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం విరాళానికి సంబంధించిన చెక్కులను వారికి చిరంజీవి అందించారు.