దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 494.28 పాయింట్ల లాభంతో 74,742.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 152.60 పాయింట్లు లాభపడి 22,666.30 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.31గా ఉంది. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, NTPC, JSW స్టీల్, ఎల్అండ్టీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. నెస్లే ఇండియా, విప్రో, సన్ఫార్మా, HCL టెక్నాలజీ, టైటాన్ షేర్లు నష్టపోయాయి.