పెళ్లైన నాలుగు రోజులకే పుట్టింటికి పంపేశాడు

583చూసినవారు
పెళ్లైన నాలుగు రోజులకే పుట్టింటికి పంపేశాడు
బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లెలో ఆదివారం ఓ నవ వధువు వరుడి ఇంటి ముందు ఆందోళన చేసింది. గత నెల 24న సుంకరి ప్రవీణ్‌కు మంచిర్యాలకు చెందిన ఓ యువతి (22)తో వివాహమైంది. పెళ్లయిన నాలుగో రోజే భర్త వధువును ఆమె పుట్టింటి వద్ద విడిచిపెట్టాడు. ఆ యువతి ఇంట్లో అన్నం తినడం లేదని, జ్యూస్‌లే తాగుతుందని ప్రవీణ్‌ చెప్పడంతో కుటుంబసభ్యులు విస్తుపోయారు. అమ్మాయితో కాపురం చేయడం ఇష్టం లేదంటూ ఇంటికి తాళం వేసుకొని బయటకు వెళ్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్